ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,657 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1941 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 6, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,10,943 కు చేరుకుంది. ఇక కరోనా వలన ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు మరియు కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7251 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 835 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,91,883 కు చేరింది. అలాగే ప్రస్తుతం 11809 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,52,70,771 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1941):
- తూర్పుగోదావరి – 27
- కర్నూల్ – 86
- కృష్ణా – 212
- కడప – 74
- గుంటూరు – 424
- చిత్తూరు – 323
- అనంతపూర్ – 71
- నెల్లూరు – 231
- ప్రకాశం – 59
- శ్రీకాకుళం – 102
- విశాఖపట్నం – 258
- విజయనగరం – 49
- పశ్చిమగోదావరి – 25
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ