తెలంగాణ రాష్ట్రంలో మరో 1914 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 6, మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,649 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 74,274 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1734 కి పెరిగింది. కరోనా నుంచి మరో 285 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,03,298 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,617 యాక్టీవ్ కేసులు ఉండగా, వారిలో 6,634 మంది హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్ లో ఉన్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1914):
- జీహెచ్ఎంసీ ఏరియా – 393
- మేడ్చల్ మల్కాజిగిరి – 205
- నిజామాబాద్ – 179
- రంగారెడ్డి – 169
- నిర్మల్ – 104
- కరీంనగర్ – 80
- సంగారెడ్డి – 76
- జగిత్యాల – 68
- కామారెడ్డి – 64
- వరంగల్ అర్బన్ – 60
- ఖమ్మం – 48
- సిద్దిపేట – 42
- నల్గొండ – 40
- మంచిర్యాల – 37
- మహబూబ్ నగర్ – 36
- రాజన్న సిరిసిల్ల – 32
- సూర్యాపేట – 31
- ఆదిలాబాద్ – 29
- యాదాద్రి భువనగిరి – 25
- వికారాబాద్ – 25
- మెదక్ – 23
- పెద్దపల్లి – 23
- కొమరం భీం ఆసిఫాబాద్ – 21
- నాగర్ కర్నూల్ – 18
- వనపర్తి – 17
- జనగామ – 13
- జోగులాంబ గద్వాల్ – 12
- వరంగల్ రూరల్ – 9
- నారాయణ్ పేట్ – 8
- భద్రాద్రి కొత్తగూడెం – 7
- మహబూబాబాద్ – 6
- ములుగు – 6
- జయశంకర్ భూపాలపల్లి – 5
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ