తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఫిబ్రవరి 8, మంగళవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మే 17, 2021 నుంచి మే 26, 2021 వరకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలోనే ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా ఈసారి పదో తరగతిలో 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
- మే 17 – ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్-A, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కంపోజిట్ కోర్సు), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కంపోజిట్ కోర్సు)
- మే 18 – సెకండ్ లాంగ్వేజ్
- మే 19 – ఇంగ్లీష్
- మే 20 – మ్యాథ్స్
- మే 21 – సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్)
- మే 22 – సోషల్
- మే 24 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం మరియు అరబిక్)
- మే 25 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం మరియు అరబిక్)
- మే 26 – ఒకేషనల్ కోర్సు (థియరీ)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ