అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో, సంక్షేమ పథకాలు అమలు చేయటంలో, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించటంలో, పారిశ్రామికంగా పెట్టుబడులు తీసుకురావడంలో.. ఇలా ఏ రంగం చూసుకున్నా తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలకన్నా నెం 1 స్థానంలో ఉందని కవిత తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. అలాగే, దేశ ప్రజల ప్రయోజనం కోసం పోరాడటంలో టీఆర్ఎస్ ముందుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచితనాన్ని, సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని కవిత ప్రతిపక్షాలకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ