తెలంగాణ రాష్ట్రంలో గత ఆగస్టు నుంచే గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పేర్లను నిర్ణయించి, ఆమోదం తెలిపారు. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. కేబినెట్ ఆమోదం అనంతరం ఈ పేర్లను ఆమోదం కోసం ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్దకు పంపింది. గవర్నర్ ఆమోదం అనంతరం ఈ ముగ్గురు సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశమునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ