హైదరాబాద్‌లోని ‘సుశీ ఇన్‌ఫ్రా’లో తెలంగాణ జీఎస్టీ అధికారుల సోదాలు

Telangana State GST Officers Conducts Rides on Sushee Infra and Mining Limited Company Hyderabad Today,Telangana State GST,Telangana State GST Officers,GST Officers,Mango News,Mango News Telugu,Rides on Sushee Infra and Mining Limited,Sushee Infra and Mining Limited,Sushee Infra and Mining Limited Company,Sushee Infra Hyderabad,Telangana Latest News And updates,Sushee Infra News And Live Updates

తెలంగాణ స్టేట్ జీఎస్టీ అధికారులు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో సోదాలు చేపట్టారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన ఈ కంపెనీలో సోమవారం ఉదయం నుంచి నుంచి దాడులు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుశీ ఇన్ ఫ్రాకు చెందిన ఇతర కార్యాలయాల్లో సోదాలు కొన‌సాగుతున్నాయి. స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను సుశీ ఇన్ ఫ్రా ఎగ్గొట్టినట్లు అధరాలు లభించడంతో ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా సుశీ ఇన్ ఫ్రాకి ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ దాడులు నిర్వహిస్తోంది. కాగా ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరోపించడమే కాకుండా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే నేడు స్టేట్ జీఎస్టీ అధికారులు ఈ కంపెనీలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =