తెలంగాణ స్టేట్ జీఎస్టీ అధికారులు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో సోదాలు చేపట్టారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన ఈ కంపెనీలో సోమవారం ఉదయం నుంచి నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుశీ ఇన్ ఫ్రాకు చెందిన ఇతర కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను సుశీ ఇన్ ఫ్రా ఎగ్గొట్టినట్లు అధరాలు లభించడంతో ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా సుశీ ఇన్ ఫ్రాకి ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ దాడులు నిర్వహిస్తోంది. కాగా ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరోపించడమే కాకుండా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే నేడు స్టేట్ జీఎస్టీ అధికారులు ఈ కంపెనీలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE