తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 4వ తేదీన పీటీ ఈసెట్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో మే 6వ తేదీ వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 13 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే 20 వరకు మరియు రూ.10,000 ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
మే 20 నుంచి మే 27 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇక మే 28 నుంచి మే 31 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు నిర్వహించి, జూన్ 15వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 2020 -21 విద్యా సంవత్సరానికి గానూ పీజీ ఈసెట్ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) పద్దతిలో ఆన్లైన్ మోడ్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్:
- పీటీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల: మార్చి 4
- ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ: మార్చి 12 నుంచి ఏప్రిల్ 30
- రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరణ: మే 6
- రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరణ: మే 13
- రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరణ: మే 20
- రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరణ: మే 26
- హాల్ టికెట్లు డౌన్లోడ్: మే 20 నుంచి మే 27
- పీజీ ఈసెట్ పరీక్షలు నిర్వహణ తేదీలు: మే 28 నుంచి మే 31
- ఫలితాలను వెల్లడించే తేదీ: జూన్ 15
[subscribe]