తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులను ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. కాగా 1 నుంచి 9 వ తరగతుల వరకు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించిన సమ్మెటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ-2) పరీక్షల షెడ్యూల్ ను మారుస్తునట్టు తాజాగా విద్యా శాఖ ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు 1-9 తరగతుల ఎస్ఏ-2 పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత రోజైన ఏప్రిల్ 23న ఫలితాల ప్రకటించనున్నారు, అలాగే పాఠశాలలకు ఏప్రిల్ 23 చివరి పనిదినం కానుంది. ఇక ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
మరోవైపు ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో హాఫ్ డే పాఠశాలల సమయాన్ని మార్చి 31 నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్ పరిధిలోని అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 8:00 గంటల నుండి 11:30 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ