దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,335 కరోనా కేసులు, 52 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,25,775 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,21,181 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 1,918 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,24,90,922 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 15 వేల దిగువకు (13,672 – 0.03%) చేరుకున్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (మార్చి 31 (8am)–ఏప్రిల్ 1 (8am)):
- కేరళ – 429
- మహారాష్ట్ర – 183
- మిజోరాం – 162
- ఢిల్లీ – 113
- కర్ణాటక – 78
- హర్యానా – 56
- ఉత్తర్ ప్రదేశ్ – 55
- తమిళనాడు – 35
- వెస్ట్ బెంగాల్ – 33
- ఒడిశా – 32
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ