తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఉన్నత తెలంగాణ విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ tsche.ac.inలో చెక్ చేసుకోవచ్చని వారు తెలిపారు. ఇక పీజీ కోర్సులతో పాటు ఇంటిగ్రేటెడ్, డిప్లొమా కోర్సుల్లో దాదాపు 50 సబ్జెక్టులకు సీపీగెట్ను నిర్వహించగా మొత్తం 67,027 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో 57,262 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆగస్టు 11 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు.. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ మహిళా వర్సీటీ.. ఈ 8 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY