టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. బుధవారం ఉదయం తొలుత ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిలను ఉద్దేశించి చేసిన ట్వీట్కు షర్మిల కౌంటర్ ట్వీట్ పెట్టగా.. మళ్లీ ఆ ట్వీట్కు కవిత మరో ఘాటు ట్వీట్తో రిప్లై ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఇది కొనసాగుతుండటం గమనార్హం. నిన్న ప్రగతి భవన్ వద్ద ఆందోళన సందర్భంగా షర్మిలను కారుతో సహా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం, అనంతరం బెయిల్ పైన ఆమె విడుదలవడం వంటి పరిణామాలపై కవిత స్పందిస్తూ.. ‘తాము వదిలిన బాణం తాన అంటే తామర పువ్వులు తందాన అంటున్నాయి’ అని ఈ ఉదయం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ షర్మిల, ‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజా సమస్యలు చూసింది లేదు.. పదవులే కానీ.. పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవలేదు’ అని కౌంటర్ ఇచ్చారు. ఇక దీనిపై తాజాగా ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘మీ లాగా నేను పొలిటికల్ టూరిస్టు కాదు.. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అని ఆమె బదులిచ్చారు.
అమ్మా.. కమల బాణం
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణంమీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరేంజ్ ప్యారేట్టుమీ లాగా
పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి ” కవిత” ను నేను ! https://t.co/rkGthDtHF9— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE