టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం

Telangana Twitter War Between TRS MLC Kavitha and YSRTP Chief YS Sharmila,Twitter War Between Kavitha and Sharmila,Telangana Twitter War,TRS MLC Kavitha,YSRTP Chief YS Sharmila,Kavitha,Sharmila,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. బుధవారం ఉదయం తొలుత ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిలను ఉద్దేశించి చేసిన ట్వీట్‌కు షర్మిల కౌంటర్‌ ట్వీట్‌ పెట్టగా.. మళ్లీ ఆ ట్వీట్‌కు కవిత మరో ఘాటు ట్వీట్‌తో రిప్లై ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఇది కొనసాగుతుండటం గమనార్హం. నిన్న ప్రగతి భవన్ వద్ద ఆందోళన సందర్భంగా షర్మిలను కారుతో సహా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, అనంతరం బెయిల్ పైన ఆమె విడుదలవడం వంటి పరిణామాలపై కవిత స్పందిస్తూ.. ‘తాము వదిలిన బాణం తాన అంటే తామర పువ్వులు తందాన అంటున్నాయి’ అని ఈ ఉదయం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ షర్మిల, ‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజా సమస్యలు చూసింది లేదు.. పదవులే కానీ.. పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవలేదు’ అని కౌంటర్ ఇచ్చారు. ఇక దీనిపై తాజాగా ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘మీ లాగా నేను పొలిటిక‌ల్ టూరిస్టు కాదు.. ఉద్య‌మంలో నుంచి పుట్టిన మట్టి క‌విత‌ను నేను’ అని ఆమె బదులిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =