రాజ్భవన్లో నేటి సాయంత్రం జరగనున్న ఉగాది వేడుకలలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు గవర్నర్ తమిళిసై. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్లో జరిగే ఉగాది వేడుకలకు హాజరు కానున్నారు. ప్రతి యేటా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో వేడుకలు జరపటం ఆనవాయితీగా వస్తోంది. గవర్నర్ గా ఎవరు ఉన్నా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ఉగాది వేడుకలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేశారు.
దీనిలో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులకు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ను కూడా ఈ ఉగాది వేడుకలలో పాల్గొనాల్సిందిగా గవర్నర్ తమిళిసై ఆహ్వానం పంపారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం తరపున గవర్నర్ కు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఉగాది వేడుకలలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్కు ఆహ్వానం పంపటం విశేషం. అయితే రాజ్భవన్లో కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. ఈ వేడుకలకు రాజకీయ పార్టీల ప్రముఖులతో పాటు ప్రభుత్వశాఖలలోని పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ