తెలంగాణలో బయటపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు మండలం కొంపల్లిలో శనివారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘భారత్ జోడో యాత్ర’ నుంచి దృష్టి మళ్లించేందుకు టీఆర్ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని, దీనిలో భాగంగానే ఎమ్మెల్యేల వ్యవహారం వెలుగు చూసిందని పేర్కొన్నారు. దీనిద్వారా మునుగోడు బరిలో కాంగ్రెస్ లేదనే విధంగా సీఎం కేసీఆర్ చూపిస్తున్నారని, దీనికి బీజేపీ కూడా సహకరిస్తోందని రేవంత్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని, ఏసీబీ ఆయన పర్యవేక్షణలో నడుచుకుంటోందని తెలిపారు. ఒకవేళ పోలీసులు చెప్పింది నిజమే అయితే, ఇప్పటివరకు ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY