తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (అక్టోబర్ 1, శనివారం) వరంగల్ లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ వరంగల్కు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ములుగు రోడ్డులోని దామెర క్రాస్ రోడ్డు వద్ద అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ప్రతిమ (ప్రతిమ రిలీఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మెడికల్ కాలేజీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
వరంగల్ సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇప్పటికే పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు, మరోవైపు వరంగల్ లో భద్రకాళీ అమ్మవారిని కూడా సీఎం కేసీఆర్ దర్శించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పర్యటనను ముగించుకుని సీఎం కేసీఆర్ మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY