కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కీలక ప్రకటన చేశారు. మే 16వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా బుధవారం నాడు కపిల్ సిబల్ వెల్లడించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ లో నాయకత్వ, విధానాల మార్పుల కోసం పోరాడుతున్న అసమ్మతి వర్గమైన “జీ-23” నాయకుల గ్రూపులో కపిల్ సిబల్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ నాయకత్వంతో విభేదాలు ఉండడం, తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన పొలిటికల్ అఫైర్స్ గ్రూప్, టాస్క్ ఫోర్స్-2024 గ్రూప్స్ లో కొందరు జీ-23 నాయకులకు స్థానం కల్పించిన నేపథ్యంలో కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ముందుగా బుధవారం ఉదయం లక్నోలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో, ఆ పార్టీ మద్ధతుతో కపిల్ సిబల్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగానే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. కపిల్ సిబల్ మీడియాతో మాట్లాడుతూ, తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని, దేశంలో ఇండిపెండెంట్ వాయిస్ ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF