తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక చెరువులు, వాగులు అలుగుపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టిఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ ఓ వాగు వద్ద నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఆగస్టు 16, ఆదివారం రాత్రి జంగపల్లి శ్రీనివాస్, తన ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాగులో గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురిని రక్షించగా, వరద దాటికి శ్రీనివాస్ కారుతో సహా కొట్టుకుపోయారు.
శ్రీనివాస్ గల్లంతైన ఘటనపై సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటిఆర్ స్పందించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడి, ఈ ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి కేటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కేటిఆర్ ఆదేశాలతో ఘటన స్థలం వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu