టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తెలుగు సినీపరిశ్రమకు సంబంధించి పలు హామీలను పొందుపరిచారు. కరోనాతో కుదేలై ఆర్ధికంగా నష్ట పోయిన సినిమా రంగాన్ని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం సినిమా పరిశ్రమ, చిత్రనిర్మాణ రంగానికి దేశంలోనే పెట్టింది పేరని, కరోనాతో చితికి పోయిన చిత్ర పరిశ్రమను పునరుజ్జీవింపచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
తెలుగు సినీపరిశ్రమకు వరాలు:
- జీహెచ్ఎంసీతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థలతోపాటు ఉండే హెచ్, ఎల్టీ కేటగిరి కనెక్షన్లకు సంబంధిచిన విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేస్తుంది.
- రాష్ట్రంలో 10 కోట్లలోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ 9% రీయంబర్స్మెంట్ ను సహాయంగా అందించి చిన్న సినీ పరిశ్రమలను ఆదుకుంటామని హామీ.
- రాష్ట్రంలోని అన్నిరకాల సినిమాధియేటర్లలో ప్రదర్శనలను (షోలు) పెంచుకునేందుకు అనుమతి.
- మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ