జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. అన్ని పార్టీల కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మొత్తం 150 డివిజన్లలో టిఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలవగా, ప్రచారానికి తక్కువ సమయమే ఉండడంతో అన్ని చోట్ల పర్యటించడంలో భాగంగా ప్రణాళికబద్దంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం నుంచి మంత్రి కేటిఆర్ ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు.
ఈ రోజు మంత్రి కేటిఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే:
- సాయంత్రం 4 గంటలకు: అష్టలక్ష్మి టెంపుల్ ఆర్చ్ చౌరస్తా, ఆర్కేపురం (మహేశ్వరం నియోజకవర్గం)
- సాయంత్రం 5 గంటలకు: బిగ్ బజార్ చౌరస్తా, మన్సూరాబాద్ (ఎల్బీనగర్ నియోజకవర్గం)
- సాయంత్రం 6 గంటలకు: రైతు బజార్, వనస్థలిపురం (ఎల్బీనగర్ నియోజకవర్గం)
- సాయంత్రం 7 గంటలకు: ఇంద్రా-నాగేంద్ర టాకీస్, కర్మన్ ఘాట్ (ఎల్బీనగర్ నియోజకవర్గం)
- సాయంత్రం 8 గంటలకు: పీఅండ్ టి కాలనీ చౌరస్తా (ఎల్బీనగర్ నియోజకవర్గం)
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ