ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టు కీలక ఆదేశాలు.. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలకు బెయిల్ మంజూరు

TRS MLAs Poaching Case High Court Issues Bail For Three Accused Ramachandra Bharathi Nanda Kumar and Simhayaji,TRS MLAs Poaching Case,Telangana HC Bail Ramachandra Bharathi,Telangana HC Bail To Nanda Kumar and Simhayaji,Mango News,Mango News Telugu,Mla Purchase Case, Give Notice To Bl Santosh By E-Mail, Telangana Hc Orders Sit,Telangana Mla Poaching Case,Telangana Mla Poaching Case Latest News And Updates,Telangana Mla Poaching ,Telangana Bjp,Telangana Cm Kcr,Trs Party,Brs Party,Ysrtp,Brs Party Latest News And Updates,Trs Mlas Purchase Case,Sit Notices Issued To Two Others

varaతెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన ఆరోపణలపై ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు ఈ ముగ్గురు నిందితులకు బెయిల్ జారీ చేసింది. ఈ మేరకు గురువారం దీనిపై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత కొన్ని వారాలుగా జైల్లో ఉంటున్న నిందితులకు ఊరట లభించింది.

ఇక దీనికోసం వారు ఇద్దరు స్యూరిటీ ఇవ్వడంతో పాటు రూ.3 లక్షలు వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలని సూచించింది. అలాగే ప్రతి సోమవారం క్రమం తప్పకుండా అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని, విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఇంకా ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేయాలని కూడా పేర్కొంది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో పూర్తిస్థాయి విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వీరిని పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసుకి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 17 =