తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్స్ జరిగాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ నియమితులయ్యారు. ఏవీ రంగనాథ్ ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు వరంగల్ పోలీసు కమిషనర్ గా విధులు నిర్వర్తించిన డాక్టర్ తరుణ్ జోషిని బదిలీపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE