తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) పలువురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ కు కూడా నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగగా.. బీఎల్ సంతోష్ కు ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా అయినా నోటీసులు పంపాలని సిట్ కు కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆయన శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీఆర్పీసీ 41ఏ కింద సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం డిసెంబర్ 5 వరకూ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE