హైదరబాద్లో ప్రసిద్ది చెందిన బాలాపూర్ గణేశుడిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు ఎదురవకూడదని ఆ గణేశుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవితతోపాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్తిక్ రెడ్డి తదితరులు పూజలో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్సీ రాక సందర్భంగా ఆమెకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.
Blessed to have offered my prayers at the iconic, oldest and beautiful Balapur Ganesh Mandapam, today.
May the blessings of Lord Ganesha always be with us.Thank you and congratulations to Balapur Ganesh Utsav Committee for another landmark celebration.#GaneshChaturthi2022 pic.twitter.com/GVa7SYjrjv
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 8, 2022
దర్శనం అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఈరోజు పురాతన బాలాపూర్ గణేశుడిని తొలిసారిగా దర్శించుకున్నానని తెలిపారు. ఇక్కడి గణేష్ మండపం వద్ద ప్రార్థనలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతాషాన్నిచిందని, ఆ గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇక్కడి గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి గణేష్ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ ఉత్సవాల్లో చివరి రోజు లడ్డూ వేలానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అలాంటి విశిష్టత కలిగిన ఈ బాలాపూర్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం కల్పించిన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు అని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ