టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి నిజపాద దర్శనం సేవలో ఆమె పాల్గొన్నారు. స్వామి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు కవితకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ముందుగా గురువారం నాడు కవిత దంపతులు అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అనంతరం తిరుమల పర్యటనపై ఆమె ట్వీట్ చేస్తూ “కుటుంబ సమేతంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిజపాదసేవలో దర్శించుకుని,మొక్కులు చెల్లించుకున్నాను. ఏడు కొండల స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ