తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు, ప్రజలు అందరికి భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని, పొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం వంటివి దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, దేశ ప్రజల సహకారంతో వ్యవసాయరంగ నమూనాను మార్చి గుణాత్మక అభివృద్ధికి పటు పడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE