తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓవైపు హైదరాబాద్ హెచ్ఐసీసీలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పార్టీ ప్లీనరీ జరుగుతుండగా, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో నాయకులు, పార్టీ శ్రేణులు పార్టీ జెండాలను ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తెలంగాణ భవన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ కేక్ కట్ చేసి, సంబురాలు జరిపారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, టీఆర్ఎస్ నేత విజయారెడ్డితో పాటుగా పలువురు పార్టీ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ