తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు ఆ వైరస్ బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సోమవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆయనకు పాజిటివ్గా తేలినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఖమ్మంలోని తన నివాసంలో హోమ్ క్యారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
“అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలుండటంతో హోమ్ క్వారంటైన్లో ఉన్నా. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో అందరి ముందుకొస్తా” అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ