ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మండలకేంద్రాల్లో టీఆర్ఎస్ నిరసన దీక్షలు

TRS Party Conducting Protest Against Center at All Mandals In the State over Paddy Procurement Issue, TRS Party Conducting Protest Against Center at All Mandals In the State, Paddy Procurement Issue, TRS Party Protest, TRS Party Protest Against Paddy Procurement Issue, TRS Party Protest Latest News, TRS Party Protest Latest Updates, TRS Party Protest Live Updates, Telangana Paddy Procurement Issue, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement, Paddy Procurement Latest News, Paddy Procurement Latest Updates, Paddy Procurement Live Updates, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Telangana, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన చేపడుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన కార్యాచరణకు అనుగుణంగా నేడు మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రైతు దీక్షలో పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని, రాష్ట్రంలో ధాన్యం మొత్తం కొనాలని కేంద్రాన్ని డిమాండ్​ చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ముందుగా తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గత కొన్ని రోజులుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేవరకు వదిలేది లేదని, ఎంతవరకైనా పోరాడతామని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పూర్తిస్థాయి కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగా ఏప్రిల్ 4, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ 6న నాగపూర్‌, ముంబై, బెంగళూరు, విజయవాడ వంటి జాతీయ రహదారుల దిగ్బంధం చేసి, రహదారులపై రాస్తారోకో ద్వారా నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

ఏప్రిల్‌ 7న హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఏప్రిల్‌ 8న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, ప్రతి రైతు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇండ్లపై నల్లా జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇక ఏప్రిల్‌ 11వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్‌ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లు మేయర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు అంతా పాల్గొననున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =