బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్లో సర్వం సిద్ధమైంది. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్కు వస్తున్నారు. ఈ క్రమంలో జులై 3న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి, బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
- శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరతారు.
- మధ్యాహ్నం 2.55 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
- బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 3.20 గంటలకు హైటెక్స్లోని నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు.
- 3.30 గంటలకు హెచ్ఐసీసీకి చేరుకొని 4 గంటల వరకు అక్కడ గడపనున్నారు.
- సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు.
- ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు.
- ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్ నుంచి హెలికాప్టర్లో 6.15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
- ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్కు వెళతారు.
- సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
- అనంతరం రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి రాజ్భవన్కు చేరుకుంటారు.
- సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అక్కడినుంచి ప్రత్యేక విమానంలో 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ