బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం: రేపు హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్‌ ఇదే

BJP National Executive Meet PM Modi To Visit Hyderabad Tomorrow A Complete Schedule, PM Modi To Visit Hyderabad Tomorrow A Complete Schedule, A Complete Schedule For PM Modi To Visit Hyderabad Tomorrow, PM Modi Complete Schedule, A Complete Schedule, PM Modi To Visit Hyderabad Tomorrow, PM Modi Hyderabad Visit Tomorrow, PM Modi Hyderabad Tour Tomorrow, PM Modi Hyderabad Tour, BJP National Executive Meet, National Executive Meet, BJP National Executive Meet News, BJP National Executive Meet Latest News, BJP National Executive Meet Latest Updates, BJP National Executive Meet Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌లో సర్వం సిద్ధమైంది. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో జులై 3న హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి, బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.

ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇదే..
  • శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరతారు.
  • మధ్యాహ్నం 2.55 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 3.20 గంటలకు హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు.
  • 3.30 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకొని 4 గంటల వరకు అక్కడ గడపనున్నారు.
  • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు.
  • ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు.
  • ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్‌ నుంచి హెలికాప్టర్‌లో 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళతారు.
  • సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
  • అనంతరం రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.
  • సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • అక్కడినుంచి ప్రత్యేక విమానంలో 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − five =