ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. తెరాస ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ కార్యక్రమాలు, కేంద్రంపై పోరు వంటి పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పై విమర్శలదాడి పెంచాయి. దీంతో అధికార పార్టీలో కొంత ఆందోళన నెలకొంది. ఈ అంశాలన్నింటిపై చర్చించేందుకు ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ఎదుర్కోవడంపై పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలను ఎండగట్టే విధంగా చర్చ జరుగనుందని తెలిసింది. కేంద్రప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని టీఆర్ఎస్ పార్లమెంట్ వేదికగా తమ నిరసన గళం కూడా విన్పించింది. కాగా, ఈ అంశాలన్నింటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యచరణ ఎలా ఉండాలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నట్టు తెలిసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ