దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ప్రపంచ దేశాల్లో ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. కొత్తగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 87కు చేరాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఏపీ, తమిళనాడు, బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 1, కేరళలో 5, గుజరాత్ లో 5, తెలంగాణలో 7, కర్నాటకలో 8, ఢిల్లీలో 10, రాజస్తాన్ లో 17, మహారాష్ట్రలో అధికంగా 32 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దేశరాజధాని ఢిల్లీలోనూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కొత్త కేసుల సంఖ్య పెరిగింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, “ఒక పేషెంట్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం, తొమ్మిది మంది ఒమిక్రాన్ రోగులు ఢిల్లీలోని ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చేరారు. వారిలో ఎవరికీ తీవ్రలక్షణాలు లేవు” అని వెల్లడించారు. కాగా, 40 మంది కోవిడ్ రోగులు ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం విమానాశ్రయం నుండి ఎనిమిది మంది అనుమానితులు వచ్చారు. విమానాశ్రయం నుండి వస్తున్న చాలా మందికి కోవిడ్ పాజిటివ్గా గుర్తించబడింది. ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో ఓమిక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డు ఉంది. పడకల సంఖ్యను కూడా 40 నుంచి 100కి పెంచారు. దేశంలోని అన్ని ల్యాబ్లలో రోజూ పెద్ద సంఖ్యలో కోవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్ జన్యుపరీక్షలు కూడా జరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ