మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 14 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, కార్యచరణపై చర్చించేందుకు బుధవారం ఉదయం తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అలాగే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కూడా మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ