రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు, అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు మరింత శ్రద్ధ చూపాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హాస్టళ్లలో ఎస్ఎస్సీ చదివే వారందరిని ఒకే చోటకు చేర్చి అత్యుత్తమ శిక్షణనిచ్చి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సచివాలయంలోని తన ఛాంబర్ లో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. విద్యార్థులు చలి నీళ్లతో ఇబ్బందులు పడకుండా, సౌర విద్యుత్ ద్వారా వేడి నీళ్లను అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, కమిషనర్ యోగితారాణ, గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY