టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తనకు, డ్రగ్స్కు అసలు ఏం సంబంధమని అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. డ్రగ్స్కు అంబాసిడర్ అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. తానూ అన్ని డ్రగ్స్ టెస్టులకు సిద్ధమని, రాహుల్ గాంధీ కూడా సిద్ధమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎవడో పిచ్చోడు ఈడీకీ లెటర్ ఇచ్చాడని విమర్శించారు. ప్రతిపక్షాలకు ఎలాంటి పనిలేకనే తమపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందరి చరిత్రలు తమకు తెలుసన్నారు. పదవి కొనుక్కున్న వాళ్ళు, రేపు టిక్కెట్లు అమ్ముకోరా అని నిలదీశారు. ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తే, అవసరమైతే రాజద్రోహం కేసులు పెడతామని అన్నారు.
మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ విమర్శలపై స్పందిస్తూ, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జనసంఘ్ ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చరిత్రకు మతం రంగు పూస్తున్నారని విమర్శించారు. ఎంఐఎంకు ఎవరూ భయపడట్లేదని, బీజేపీనే భయపడుతోందని అన్నారు. అలాగే తెలంగాణలో కొత్తగా పార్టీలు ఎందుకు పుట్టుకొస్తున్నాయో ప్రజలకు తెలుసన్నారు. కొత్త పార్టీల నాయకులు కాంగ్రెస్, బీజేపీలపై ఎందుకు మాట్లాడారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ