తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పురోగతి, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు జీవిత భీమా సదుపాయం, హుజురాబాద్ ఉపఎన్నికలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా పలు ఇతర అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. అలాగే పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపై కూడా పార్టీ ప్రధాన కార్యదర్శులకు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు చేయనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ