తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీఎస్ ఎంసెట్-2021 షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీని మరోసారి పొడిగించారు. జూన్ 3 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.
ముందుగా షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీని (ఆలస్య రుసుము లేకుండా) మే 18గా ప్రకటించగా, అనంతరం మే 26వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ, దరఖాస్తుకు ఆఖరు తేదీని జూన్ 3 వరకు పొడిగించినట్టు తెలుస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో జరగనుండగా, జులై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, జులై 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ