తెలంగాణ రాష్ట్రంలో గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్ఆర్జేసీ” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించారు. టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని గతంలో జూలై 10 వ తేదీ వరకు పొడిగించగా, కరోనా నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ/బైపీసీ/ఎంఈసీ-ఇంగ్లీషు మీడియం) ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ఈ పరీక్ష నిర్వహణ తేదిని త్వరలో ప్రకటిస్తామని టీఎస్ఆర్జేసీ కన్వీనర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu