ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1576 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 32 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 1608 కేసులతో కలిపి జూలై 10, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25422 కు చేరింది. గత 24 గంటల్లో 21,020 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు కరోనా వలన అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 292 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 13194 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9635 మంది ఆసుపత్రుల్లో, 2301 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 11936 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu