భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 12 రోజుల పాటు ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోన్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా 12 రోజుల ఈవెంట్లు ఆగస్టు 10న ప్రారంభమై 21న ముగియనున్నాయి. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆగస్టు 15వ తేదీన జన్మించనున్న చిన్నారులందరికీ 12 ఏళ్లు పూర్తి అయ్యే వరకు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు కూడా ఈ నెల 15వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ విడుదల చేసిన ప్రెస్ నోట్లో వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేము వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, సంస్థ కార్యాలయం మరియు తెలంగాణలోని అన్ని టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలను జరుపుతామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY