గడచిన కొన్ని నెలలుగా డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ సాధారణ బస్సులకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ బస్సుల వైపు దృష్టి మళ్లించింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆర్టీసీ అధికార యంత్రాంగం దీనికి సంబంధించిన కంపెనీలకు కొటేషన్లు పంపింది. అయితే గతంలో ఒక్కొక్క బస్సును రూ. 2 కోట్లకు కొనుగోలు చేయగా, కొత్తగా కొనుగోలు చేయబోయే ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు రూ. 1.60 కోట్లకు పరిమితం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం బయట మార్కెట్లో ఈ ధరకు ఎలక్ట్రిక్ బస్సులు లభించనున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. ఈ బస్సులను నగరంలో అన్ని ప్రధాన మార్గాలలో నడపడానికి ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ప్రస్తుతం నగర పరిధిలో 400 సిటీ బస్సులు 15 సంవత్సరాలు పూర్తి అయినవి ఉన్నాయని, వీటిని స్క్రాప్ కింద మార్చాలని భావిస్తున్నారు. వాటి స్థానంలో జిల్లా నుంచి బస్సులను సిటీకి తరలించి ఆ బస్సులను సిటీ బస్సులుగా మార్చాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1016 కొత్త బస్సులను కొనుగోలు చేసి వాటిలో 400 బస్సులను సిటీ బస్సులుగా మార్చనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY