జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పెద్ద సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ 48 డివిజన్స్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారధ్యంలో, అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల అద్భుతమైన ప్రదర్శనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు అభినందనలు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల యొక్క కృషిని అభినందిస్తున్నాను” అని అమిత్ షా ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి @narendramodi గారి సారధ్యంలో,అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.
GHMC ఎన్నికల అద్భుతమైన ప్రదర్శనకు @JPNadda గారికి & @bandisanjay_bjp కు అభినందనలు.@BJP4Telangana కార్యకర్తల యొక్క కృషిని అభినందిస్తున్నాను.
— Amit Shah (@AmitShah) December 4, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ