గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని అన్నారు. గెలిచినా డివిజన్స్ కంటే అదనంగా మరో 25 గెలుస్తామని ఆశించినట్టు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలలో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని వెల్లడయిందన్నారు. చాలా డివిజన్స్ లో స్వల్ప ఓట్ల తేడాతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పారు. అయినప్పటికీ గ్రేటర్ లో ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారని, ఎన్నికల ఫలితాలపై పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. అలాగే పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికి, పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్ కు మంత్రి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ