బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం నాడు అసెంబ్లీ మీడియా హాల్ లో జగ్గారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా యువతను రెచ్చగొట్టే వాఖ్యలు బండి సంజయ్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు బండి సంజయ్ గుర్తున్నాయా అని ప్రశ్నించారు.పేదల అకౌంట్ లలో వేస్తామన్న 15లక్షల ఏమయ్యాయో చెప్పాలని అన్నారు. కనీసం తెలంగాణలోని పేదలకైనా 15లక్షలు వచ్చాయా, రాకుంటే ప్రధానితో మాట్లాడి బండి సంజయ్ ఇప్పించగలరా, దీనికి ఎందుకు బండి సంజయ్ సమాధానం చెప్పట్లేదు. ఆలయాలు, దేవుళ్ళు తప్ప పేదల ఇబ్బందులు బండి సంజయ్ కి గుర్తుకురావా అని అసహనాన్ని వ్యక్తపరిచారు.
“యూపీఏ ప్రభుత్వంలో క్రూడాయిల్, సిలిండర్ లపై పది పైసలు పెంచితే బీజేపీ నానా యాగిరి చేసేది. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇప్పటి కేంద్ర మంత్రి స్పృతి ఇరానీ సిలిండర్ రోడ్డుపై పెట్టుకోని నిరసన చేసిన విషయం మర్చిపోయారా, దీనికి బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారు. యూపీఏ ప్రభుత్వంలో 40రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ఇప్పుడు డబల్ అయింది. యూపీఏ ప్రభుత్వంలో లీటర్ డిజిల్ 36రూపాయలు ఉంటే ఇప్పుడు 78రూపాయలు అయింది. ఇది ప్రజలకు ఏంత పెద్ద భారమో బీజేపీ ప్రభుత్వం తెలుస్తుందా. పెట్రోల్, డిజిల్, సిలిండర్ ల ధర తగ్గింపుకు ముందు కేంద్రంతో మాట్లాడి, ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడాలి. ధరలు తగ్గించని పక్షంలో మేము బండి సంజయ్ కు డెడ్ లైన్ పెడతాం. స్లో పాయిజన్ లెక్క క్రూడాయిల్ ధరలు బీజేపీ పెంచుతుంది. బీజేపీ ప్రభుత్వం తెలియకుండానే పెట్రోల్, డిజిల్, సిలిండర్ ధరలు పెంచుతుంది” వీటన్నిటికీ సమాధానం చెప్పాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను డిమాండ్ చేశారు .
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ