బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా కృష్ణంరాజు సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో కీలకంగా ఉండడంతో పాటుగా.. కాకినాడ, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాల నుంచి రెండు సార్లు పార్టీ తరపున ఎంపీగా కూడా గెలిచారు. అలాగే దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి హయాంలో కృష్ణంరాజు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నగరానికి వచ్చిన కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ నేరుగా జూబ్లీహిల్స్లో గల కృష్ణంరాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ కృష్ణంరాజు నట వారసుడు, టాలీవుడ్ అగ్ర నటుడు ప్రభాస్తో పాటు కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు ఉన్నారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ ఫిల్మ్నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో కూడా తెలిపారు.
Leaving for Hyderabad to attend the prayer meeting which has been organised in memory of former Minister of State for Defence, Late Krishnam Raju Garu. I shall meet the bereaved family members and pay my condolences.
— Rajnath Singh (@rajnathsingh) September 16, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY