తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు విరాళం ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ.15 కోట్లు విరాళం ప్రకటించాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ముందెన్నడూ ఎరుగని రీతిలో వరదలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజానీకానికి సంఘీభావం తెలిపారు. ఇందుకు స్పందనగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మమతా బెనర్జీతో టెలిఫోన్ లో మాట్లాడి ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu