అక్టోబర్ 25, మంగళవారం నాడు సూర్య గ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో ఆ రోజున యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. సూర్యగ్రహణం కారణంగా అక్టోబర్ 25, మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి అక్టోబర్ 26, బుధవారం ఉదయం 8 గంటల వరకు యాదాద్రి ఆలయాన్ని మూసివేయనున్నట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీన ఆలయం మూసివేయనుండడంతో ఆ రోజున నిత్య కళ్యాణం, శాశ్వత కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసినట్టుగా తెలిపారు.
అలాగే ఈ 26వ తేదీన నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను కూడా రద్దు చేశారు. సూర్యగ్రహణం విడిచిన తర్వాత, 26వ తేదీన ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి ఉదయం 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్టు తెలిపారు. అనంతరం యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు జరుగుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY