వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన వైఎస్ షర్మిల.. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం లీక్ను నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా శుక్రవారం టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన షర్మిల.. ఈ క్రమంలో నేడు తన నివాసం నుంచి టీఎస్పీఎస్సీ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ముందుగా షర్మిల ఇంటి దగ్గర బలగాల్ని మోహరించిన పోలీసులు, తర్వాత హౌస్ అరెస్ట్ చేసి ఆందోళన చేయకుండా కట్టడి చేశారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పేపర్ లీక్ వ్యవహారంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ భవన్, ప్రగతి భవన్ మరియు టీఎస్పీఎస్సీ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇక తనను హౌస్ అరెస్టు చేయడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని, టీఎస్ పీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గం. TSPSC అక్రమాలపై CBI దర్యాప్తు చేపట్టాలి. ఎనిమిదేండ్లుగా బయటపడని అక్రమాలను కూడా తేల్చాలి. ఈ కుంభకోణంలో ఉద్యోగులతో పాటు బోర్డు సభ్యులు, మంత్రుల హస్తం కూడా ఉంది. TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయింది.
1/2 pic.twitter.com/cNjYjtH1wd— YS Sharmila (@realyssharmila) March 17, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE