కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి, ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు.
రూ.32,383 కోట్లతో 751 కి.మీ.ల పొడవున తెలంగాణలో నిర్మించనున్న 11 జాతీయ రహదారులకు 4,332 హెక్టార్ల భూమి అవసరం కాగా కేవలం 284హెక్టార్ల భూమిని మాత్రమే ఎన్ హెఛ్ఏఐకు అప్పగించారని కిషన్ రెడ్డి తెలిపారు. మిగిలిన భూమినికూడా సకాలంలో అందించేలా చర్యలు తీసుకొని ప్రాజెక్టులు సమయానికి పూర్తవటానికి సహకరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు రాసిన లేఖను జత చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
మిగిలిన భూమినికూడా సకాలంలో అందించేలా చర్యలుతీసుకొని ప్రాజెక్టులు సమయానికిపూర్తవటానికి సహకరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ గారికి లేఖరాశాను. pic.twitter.com/ftGCOgkfKN
— G Kishan Reddy (@kishanreddybjp) March 16, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE