భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం బుధవారం నాడు ట్వీట్ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu