దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 62,258 కరోనా కేసులు, 291 మరణాలు నమోదుకావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,08,910 కు, మరణాల సంఖ్య 1,61,240 కు చేరుకుంది. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 4,52,647 (3.80%) కు చేరుకుంది. మరోవైపు 30,386 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,12,95,023 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 94.85 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.35 శాతంగా ఉంది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 80 శాతం 6 రాష్ట్రాలలోనే:
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 79.57 శాతం మహారాష్ట్ర(36902), పంజాబ్ (3122), ఛత్తీస్ ఘడ్ (2665), కర్ణాటక (2566), గుజరాత్ (2190), మధ్యప్రదేశ్ (2091) వంటి 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. ఇక మార్చి 26, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 23,97,69,553 కు చేరుకుంది. గత 24 గంటల్లో 11,64,915 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ