టీఎస్ఆర్టీసీ లో సమ్మె సైరన్

Mango News Telugu, Political Updates 2019, RTC Workers Unions Serve Strike Notice To RTC Management, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Workers Unions Serve Strike, TSRTC Workers Unions Serve Strike Notice, TSRTC Workers Unions Serve Strike Notice To RTC Management

తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి టీఎంయూ సైతం సమ్మె నోటీసు ఇచ్చింది. ఇప్పటికే యాజమాన్యానికి టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ యూనియన్లు సమ్మె నోటీసు అందజేశాయి. దీంతో టీఎస్ఆర్టీసీ లో సమ్మె సైరన్ మోగినట్టయింది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేసారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై బస్ భవన్ లో ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ను కలిసి సమ్మె నోటీసులు అందజేశారు.

తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని, సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, యూనియన్లకు సహకరించాలని అశ్వత్థామ రెడ్డి కోరారు. యూనియన్ల సమ్మె నోటీసుతో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అప్రమత్తమయ్యారు. డిమాండ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, కార్మిక సంఘ నేతలను కలిసారు. వారి డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

 

[subscribe]
[youtube_video videoid=NovBgIywI_U]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eleven =